తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 6, మంగళవారం నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ లో ముఖ్య ఇంజినీర్లు, అధికారులతో కలిసి మేడిగడ్డ చేరుకుంటారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు 140 కీ. మీ పరిధిలో గల గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, కాళేశ్వరం మరియు ఇతర ప్రాంతాలను ఇంజినీర్లులతో కలిసి పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో ముందుగా మేడిగడ్డ చేరుకొని అక్కడ గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
మేడిగడ్డ బ్యారేజ్ పరిసరాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు, అక్కడి నీటి ప్రవాహాన్ని మరియు నీరు దిగువకు విడుదల అవుతున్న తీరుని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించనున్నారు. తరువాత, గోలివాడ పంప్హౌస్ వద్దకు చేరుకొని ఎల్లంపల్లి బ్యారేజ్ ని పరిశీలిస్తారు. అందరితో కలిసి అక్కడే మధ్యాహ్నం భోజనం చేస్తారు. గోలివాడ పంప్హౌస్ నుంచి ధర్మపురి చేరుకొని అక్కడి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, మరల సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు పయనమవుతారు.
[subscribe]
[youtube_video videoid=pMqwFiaUVAM]