తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు కరీంనగర్ కు వెళ్లారు. బీసీ సంక్షేమం, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య ఇటీవలే కన్నుమూశారు. ఈ నేపథ్యంలో సోమవారం కరీంనగర్ లో గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య దశ దిన కర్మ కార్యక్రమం జరిగింది. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొని మంత్రి గంగుల కమలాకర్ ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ముందుగా హైదరాబాద్ నుండి కరీంనగర్ చేరుకున్న సీఎం కేసీఆర్ గంగుల నివాసానికి వెళ్లి మల్లయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మంత్రి గంగులను, కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ హెలిక్యాప్టర్లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమమ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE