జూలై 25, 26 తేదీల్లో సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ప్రతినిధులు ఆహ్వానించారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ సురిటి కామేశ్వర్, అసిస్టెంట్ కమిషనర్ గుత్తా మనోహర్ రెడ్డి, అర్చకులు మంగళవారం నాడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ