అక్టోబర్ 13, 14 తేదీల్లో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలన

Arrangements of Assembly Sessions, Council Chairman Monitored the Arrangements of Assembly Sessions, KCR Telangana Assembly Session, Telangana Assembly, Telangana Assembly Session, Telangana Assembly Session 2020, Telangana Assembly Updates, Telangana Speaker and Council Chairman

అక్టోబర్ 13, 14 తేదీల్లో అనగా రేపు, ఎల్లుండి నిర్వహించబోతున్న శాసనసభ, శాసనమండలి సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను ఈరోజు రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు. సభలో సభ్యుల మద్య భౌతిక దూరం ఉండే విధంగా అమర్చిన సీటింగ్ విధానం కొనసాగించాలని, శాసనసభ ప్రాంగణం, సభ లోపల పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయించాలని శాసనమండలి కార్యదర్శి డా.వి నరసింహా చార్యులును ఆదేశించారు. సమావేశాల బందోబస్తుపై రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్, సమావేశాలలో అవసరమైన సమాచారంపై చీఫ్ సెక్రటరీతో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఫోన్ లో మాట్లాడారు.

సమావేశాలకు హాజరయ్యే శాసనసభ, శాసనమండలి సభ్యులు, ఉభయ సభల సిబ్బంధి, మీడియా ప్రతినిధులు, పోలీసు సిబ్బందిలలో ఎవరికైనా అనుమానంగా ఉన్నా లేదా కరోనా లక్షణాలు కనిపించినా ఉభయ సభల ప్రాంగణాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెస్టింగ్ కేంద్రాలలో తప్పక పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 10 =