తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు అక్టోబర్ 7, బుధవారం ఉదయం 11:30 గంటలకు ప్రగతిభవన్ లో పోలీసు ఉన్నతాధికారుల విస్తృత స్థాయి సమావేశాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి తదితర మాదక దృవ్యాల నియంత్రణ తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే అవసరమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. హోం, అటవీ శాఖ మంత్రులు, కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, అడిషనల్ డీజీపీలు, ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu