టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రేపు (ఆగస్టు 24, మంగళవారం) మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం మరియు గ్రామ, మండల, జిల్లా, మరియు రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం, అందుకోసం తేదీల ఖరారు సహా పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళిత బంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన పద్దతి, తీసుకోవాల్సిన చర్యల గురించి, పార్టీ శ్రేణులు చేయాల్సిన కృషిపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ