తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు (ఫిబ్రవరి 21, సోమవారం) సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నారాయణఖేడ్ లో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజవకవర్గాల్లోని 3.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. మొత్తం రూ.4427 కోట్ల నిర్మాణ వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టులను నిర్మించనుంది. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం అక్కడ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం నాడు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, అధికారులుతో కలిసి పరిశీలించి, కీలక సూచనలు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ