నవంబర్ 10వ తేదీ, బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాప్రతినిధులు చేస్తున్న విజ్జప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్లు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు, వరంగల్ హన్మకొండ జంటనగరాల రవాణా, అభివృద్ధికి అవరోధంగా వున్న రైల్వే ట్రాక్ ల మీద రైల్వే వోవర్ బ్రిడ్జి ( ఆర్వోబీ) ల నిర్మాణం, తదితర అభివృద్ధి అంశాలపై స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్షజరిపి, సీఎం కేసీఆర్ మంజూరు చేయన్నారు. అలాగే వరంగల్ ఇంటర్నల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు చేపట్టవలసిన చర్యలపై, వరంగల్ టెక్స్ టైల్ పార్క్ పనుల పురోగతి అంశాలను సీఎం సమీక్షించనున్నారు. ఇక హన్మకొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్ అదే రోజున ప్రారంభించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ