రేపు బీహార్ లో సీఎం కేసీఆర్ పర్యటన, గాల్వాన్ లో అమరులైన జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయం

CM KCR Will Visit Bihar On August 31st Will Hand Over 10 Lakh To Each Family Of Martyred Soldiers At Galvan, Kcr To Leave For Bihar On Aug 31, Kcr To Visit Bihar On Aug 31,CM KCR Financial Aid To Galwan Martyrs, Mango News, Mango News Telugu, CM KCR Latest News And Updates, CM KCR Galwan Tour, CM KCR Tour News And Live Updates, Telangana CM KCR , Trs Party, Galwan Martyrs

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు ఆగస్టు 31, బుధవారం నాడు బీహార్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. చైనా సరిహద్దులోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత అమర జవాన్లను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ గతంలో మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి పాట్నా చేరుకొని గతంలో ప్రకటించిన మేరకు గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు బీహార్ కు చెందిన భారత సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు.

అలాగే సైనిక కుటుంబాలతో పాటుగా, ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు కూడా సీఎం కేసీఆర్ 5 లక్షల రూపాయల ఆర్థికసాయం అందజేయనున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కలిసి సీఎం కేసీఆర్ వారికీ చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆహ్వానం మేరకు మధ్యాహ్న లంచ్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − three =