ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 గంటల వరకు పోలింగ్ వివరాలు ఇవే, ఓటేసిన పలువురు ప్రముఖులు

Graduates MLC Elections Polling In Telangana, Graduates MLC Elections Polling Updates, Mango News, MLC Elections, MLC Elections Polling, MLC Elections Polling In Telangana, Telangana Graduates MLC Elections Polling Live, Telangana Graduates MLC Elections Polling Live Updates, Telangana Graduates MLC Elections Polling Updates, Telangana MLC Elections, Telangana MLC Elections 2021, Telangana MLC Elections Polling, Telangana MLC Elections Polling Live Updates

తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానంలో మధ్యాహ్నం 2 గంటల వరకు 43.46 శాతం మరియు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో 39.09 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ప్రముఖులు:

  • హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ లోని షేక్​పేట్​ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • నాంపల్లిలోని రెడ్ హిల్స్ జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎమర్జెన్సీ స్క్వాడ్ పోలింగ్ బూత్ వద్ద ఆదివారం ఉదయం సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉప్పరపల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి
  • హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో బరిలో నిలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి ఫ్రొఫెసర్ నాగేశ్వర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • ఓల్డ్ మలక్ పేట్ లోని అగ్రికల్చర్ కార్యాలయంలో గల పోలింగ్ కేంద్రంలో తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • ఖమ్మం శీలం సిద్దారెడ్డి కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • సూర్యపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గల పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • బూత్పూర్ మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 18 వ పోలింగ్ బూత్ లో దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • తిరుమలగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పక్రియను మార్చి 17న చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.
  • ఈ రెండు స్థానాలకు కలిపి మొత్తం 164 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో పోలింగ్ కేంద్రాల్లో జంబో బ్యాలెట్‌ బాక్సులను అధికారులు ఏర్పాటు చేశారు.
  • ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానంలో 71మంది మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 731 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో మొత్తం 5,05,565 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
  • హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 799 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో మొత్తం 5,31,268 మంది ఓట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
  • ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఆరు ఉమ్మడి జిల్లాల్లో పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =