తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో మధ్యాహ్నం 2 గంటల వరకు 43.46 శాతం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో 39.09 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ప్రముఖులు:
- హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ లోని షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- నాంపల్లిలోని రెడ్ హిల్స్ జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎమర్జెన్సీ స్క్వాడ్ పోలింగ్ బూత్ వద్ద ఆదివారం ఉదయం సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉప్పరపల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి
- హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో బరిలో నిలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి ఫ్రొఫెసర్ నాగేశ్వర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- ఓల్డ్ మలక్ పేట్ లోని అగ్రికల్చర్ కార్యాలయంలో గల పోలింగ్ కేంద్రంలో తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- ఖమ్మం శీలం సిద్దారెడ్డి కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- సూర్యపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గల పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- బూత్పూర్ మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 18 వ పోలింగ్ బూత్ లో దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- తిరుమలగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పక్రియను మార్చి 17న చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.
- ఈ రెండు స్థానాలకు కలిపి మొత్తం 164 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో పోలింగ్ కేంద్రాల్లో జంబో బ్యాలెట్ బాక్సులను అధికారులు ఏర్పాటు చేశారు.
- ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో 71మంది మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 731 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో మొత్తం 5,05,565 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
- హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 799 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో మొత్తం 5,31,268 మంది ఓట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
- ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఆరు ఉమ్మడి జిల్లాల్లో పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ