భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి పునః ప్రారంభానికి తనను ఆహ్వానించకపోవడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునఃప్రారంభం సందర్భంగా తెలంగాణ సీఎంవో ప్రోటోకాల్ పాటించలేదని ఆక్షేపించారు. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీగా ఉన్న తనను ఈ కార్యక్రమానికి పిలవాల్సి ఉండగా, ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని తెలిపారు.
యాదాద్రి పునఃప్రారంభానికి @TelanganaCMO ప్రొటోకాల్ పాటించలేదు. స్థానిక ఎంపీగా నన్ను పునః ప్రారంభానికి పిలవలేదు.
కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలను మాత్రం ఆహ్వానించింది.
దేవుడు దగ్గర కేసిఆర్ బహునీచపు రాజకీయాలు చేయడం బాధాకరం.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) March 28, 2022
ఈ కార్యక్రమానికి కేవలం అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను మాత్రమే ఆహ్వానించారని, దేవుడి దగ్గర సీఎం కేసీఆర్ ఇలా రాజకీయం చేయడం బాధాకరమని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా జిల్లాలో, రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కోమటిరెడ్డి రాష్ట్ర మంత్రిగా ఒక వెలుగు వెలిగారు. ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ నాయకులలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై సూటిగా విమర్శలు చేయగల అతికొద్దిమంది నాయకులలో కోమటిరెడ్డి ఒకరు కావడం గమనార్హం.
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ