కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మేనేని సత్యనారాయణ రావు (ఎమ్మెస్సార్) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఎంపీగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, ఆర్టీసీ చైర్మన్ గా, సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్ గా ఎమ్మెస్సార్ ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు.
1969 ప్రత్యేక తెలంగాణ పోరాటంలో ఎమ్మెస్సార్ కీలకపాత్ర పోషించారు. రాజకీయాల్లో తనదైన శైలితో విలక్షణ నేతగా గుర్తింపు పొందారు. ఎమ్మెస్సార్ మృతి పట్ల సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలు కాంగ్రెస్ నేతలు, పలు పార్టీల నేతలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెస్సార్ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం జూబ్లిహిల్స్ లోని మహా ప్రస్థానం స్మశాన వాటికలో జరగనున్నాయి.
పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మేనేని సత్యనారాయణ రావు మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ వాదిగా, ఎంపీగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్ గా ఎమ్మెస్సార్ ప్రత్యేక శైలి కనబరిచారని, రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరొందారని సీఎం గుర్తు చేసుకున్నారు. దివంగత ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ