తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1983 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 5, రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,02,594 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 10 మంది మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1181 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.
ఇక కరోనా నుంచి కొత్తగా 2,381 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,74,769 కి చేరింది. ప్రస్తుతం 26,644 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 86.26 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 292, రంగారెడ్డి జిల్లాలో 187, మేడ్చల్ లో 145, ఖమ్మంలో 117, కరీంనగర్ లో 109, నల్గొండలో 105, సిద్దిపేటలో 89, భద్రాద్రి కొత్తగూడెంలో 85, వరంగల్ అర్బన్ లో 75, సూర్యాపేటలో 75, నిజామాబాద్ లో 62 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu