లాక్డౌన్ 4.0 ను మే 31 వ తేదీవరకు పొడిగిస్తూ కంటైన్మెంట్ జోన్స్ ప్రాంతాల మినహా బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు (మే 19, మంగళవారం) ఆరు గంటలనుంచే ఆర్టీసీ బస్సుల సర్వీసులు నడిపేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. లాక్డౌన్ కారణంగా మార్చ్ 22 నాడు నిలిచిపోయిన బస్సు సర్వీసులు, 57 రోజుల తర్వాత తిరిగి పునఃప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని డిపోల నుంచి సర్వీసులు మొదలయ్యాయి.
అంతర్రాష్ట్ర బస్సులు నడపడానికి అనుమతి లేకపోవడంతో ఆయా రాష్ట్రాల సరిహద్దులలోని చివరి బస్టాండ్ వరకు బస్సులు నడిపేందుకు డిపో అధికారులు నిర్ణయించుకున్నారు. జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే బస్సులు కొన్ని హయత్ నగర్ వరకు, మరి కొన్ని జేబిఎస్ బస్టాండ్ వరకు వస్తున్నాయి. కాగా హైదరాబాద్ లో సిటీ బస్సులు నడిపేందుకు మాత్రం అనుమతి లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu