ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 19, మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2339 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 9,739 సాంపిల్స్ ని పరీక్షించగా 57 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. గత 24 గంటల్లో కోవిడ్ వలన చిత్తూర్ మరియు కర్నూల్ లో ఒక్కొక్కరు మరణించడంతో ఈ వైరస్ వలన ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 52 కి చేరింది. మరోవైపు 1596 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, ప్రస్తుతం 705 మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో మే 18, సోమవారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1592 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా జీహెఛ్ఎంసీ ఏరియాలో 26 మందికి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 3, వలస వచ్చిన వారిలో 12 మందితో కలిపి మొత్తం 41 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు తెలిపారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 34 మంది మృతి చెందగా, 1002 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 556 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2339 పాజిటివ్ కేసు లకు గాను 1596 మంది డిశ్చార్జ్ కాగా, 52 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 691. #APFightsCorona
— ArogyaAndhra (@ArogyaAndhra) May 19, 2020
Media bulletin
Date: May 18, 2020Status of positive cases of #COVID19 in Telangana. pic.twitter.com/8578bDIhrF
— Minister for Health Telangana State (@TelanganaHealth) May 18, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu