భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింత తీవ్రంగా విజృంభిస్తుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 4970 కరోనా పాజిటివ్ కేసులు, 134 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక లక్ష దాటింది. మే 18, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,01,139 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3163 కి చేరింది. కరోనా బాధితుల్లో 39,174 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 58,802 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో గత 12 రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు అయింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదైన దేశాల్లో చైనాను దాటి భారత్ 11 వ స్థానంలో నిలిచింది.
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా వైరస్ అధిక ప్రభావం చూపుతుంది. మహారాష్ట్రలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 35,058 కు చేరగా, 1249 మంది మరణించారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 2005 కేసులు నమోదవగా, 51 మంది మరణించారు. మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో అత్యధికంగా 11,760, గుజరాత్ లో 11,746 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో 1000 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
మహారాష్ట్ర – 35,058
గుజరాత్ – 11,760
తమిళనాడు – 11,746
ఢిల్లీ – 10,054
రాజస్థాన్ – 5,629
మధ్యప్రదేశ్ – 5,236
ఉత్తర ప్రదేశ్ – 4,605
పశ్చిమబెంగాల్ – 2,805
ఆంధ్రప్రదేశ్ – 2,432
పంజాబ్ – 1,980
తెలంగాణ – 1,592
బీహార్ – 1,442
జమ్మూ కశ్మీర్ – 1,289
కర్ణాటక – 1,246
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu