తెలంగాణలో గత కొన్ని రోజులుగా పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండడంతో కేసుల సంఖ్య 30 వేలకు చేరువైంది. రాష్ట్రంలో మరో 1924 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 8, బుధవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 29,536 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం నాడు 6,363 శాంపిల్స్ పరీక్షించగా 4,439 మందికి నెగటివ్ వచ్చినట్టుగా పేర్కొన్నారు. అలాగే కరోనా వలన మరో 11 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 324 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 992 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 17279 కి చేరింది. ప్రస్తుతం 11933 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1924):
- జీహెచ్ఎంసీ ఏరియా – 1590
- రంగారెడ్డి – 99
- మేడ్చల్ – 43
- వరంగల్ రూరల్ – 26
- సంగారెడ్డి – 20
- నిజామాబాద్ – 19
- మహబూబ్ నగర్ – 15
- కరీంనగర్ – 14
- నల్గొండ – 13
- రాజన్న సిరిసిల్ల – 13
- వికారాబాద్ – 11
- వనపర్తి – 9
- సూర్యాపేట – 7
- వరంగల్ అర్బన్ – 7
- యాదాద్రి – 5
- పెద్దపల్లి – 5
- మెదక్ – 5
- భద్రాద్రి కొత్తగూడెం – 5
- ఖమ్మం – 4
- జగిత్యాల – 3
- ఆదిలాబాద్ – 3
- నాగర్ కర్నూల్ – 3
- కామారెడ్డి – 3
- ఆసిఫాబాద్ – 1
- నారాయణపేట్ – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu