తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నాడు 31,486 శాంపిల్స్ పరీక్షించగా 256 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,92,128 కి చేరింది. అలాగే కరోనాతో మరొకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1581 కి పెరిగింది. కొత్తగా 298 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,86,542 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 51, మేడ్చల్-మల్కాజ్ గిరిలో 17, నల్గొండలో 11, కరీంనగర్ లో 11, రంగారెడ్డిలో 10, వరంగల్ అర్బన్ లో 10, పెద్దపల్లిలో 10, మంచిర్యాలలో 10, భద్రాద్రి కొత్తగూడెంలో 9 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (జనవరి 18, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 75,15,066
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 2,92,128
- కొత్తగా నమోదైన కేసులు : 256
- నమోదైన మరణాలు : 2
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 2,86,542
- కరోనా రికవరీ రేటు: 98.08%
- యాక్టీవ్ కేసులు: 4,005
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నవారి సంఖ్య: 2,283
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 1,581
- కరోనా మరణాల రేటు: 0.54%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ