తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికి 69625 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. జనవరి 19, మంగళవారం నాడు ఒక్కరోజే మొత్తం 33 జిల్లాల్లో 894 కేంద్రాల్లో 51997 మందికి వ్యాక్సిన్ వేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం నాడు రాష్ట్రంలోని 73,673 హెల్త్కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ వేసేలా లక్ష్యంగా పెట్టుకోగా, అందులో 71 శాతం (51,997) మందికి వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో తీవ్ర అస్వస్థతకు ఎవరూ గురికాలేదని చెప్పారు.
అయితే 51 మంది స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, వారిలో ముగ్గురు మాత్రమే ఆసుపత్రిలో చేరారని, వారు కూడా ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపారు. ఇక వారంలో సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో మాత్రమే వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడంతో బుధవారం నాడు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడంలేదు. గురువారం నాడు తిరిగి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ