తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 235 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో డిసెంబర్ 29, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,81,307 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 204 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 6,73,793 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.89 శాతంగా, మరణాల రేటు 0.59 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి మరణం నమోదు కాలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,024గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,490 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 121, రంగారెడ్డిలో 31, మేడ్చల్ మల్కాజ్గిరిలో 23 నమోదయ్యాయి.
మరోవైపు తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 62గా ఉంది. కొత్తగా రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు. కాగా గత 24 గంటల్లో ఎట్ రిస్క్ దేశాల నుంచి 346 మంది వచ్చారు. వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా, పదిమంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్గా తేలినట్టు చెప్పారు. దీంతో వారి శాంపిల్స్ ను కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామని, మొత్తం 23 మంది ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ