ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాతో సీఎం వైఎస్ జగన్ సుమారు గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఆర్సీసీ సిఫార్సు మేరకు పోలవరం వ్యయాన్ని రూ.55,656 కోట్లుగా ఆమోదించాలని, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ-నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. అలాగే వీటితో పాటుగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను సీఎం వైఎస్ జగన్ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఏపీకి ప్రత్యేక హోదా,కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు, ఏపీ విద్యుత్ రంగానికి కేంద్రం నుండి సహకారం తదితర అంశాలపై చర్చించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ