తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 1, బుధవారం నాటికీ మొత్తం కేసుల సంఖ్య 17,357 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం నాడు 4234 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన ఏడుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 267 కి పెరిగినట్టు తెలిపారు.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 788 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 8082 కి చేరింది. ప్రస్తుతం 9008 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 881, మేడ్చల్ లో 36, రంగారెడ్డి లో 33, మహబూబ్ నగర్ లో 10, వరంగల్ రూరల్, మంచిర్యాలలో 9 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu