తెలంగాణ రాష్ట్రంలో జూలై 1, బుధవారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,357 కి చేరింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో కొన్ని చోట్ల ఉచిత కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచింది. హైదరాబాద్లో ఉచిత కరోనా పరీక్షలు నిర్వహించే 11 ప్రభుత్వ ఆసుపత్రుల వివరాలను జూలై 1, బుధవారం నాడు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.
హైదరాబాద్ లో ఉచిత కరోనా పరీక్షా కేంద్రాలు:
- కింగ్ కోఠి హాస్పిటల్ – కోఠి
- ఫీవర్ హాస్పిటల్ – నల్లకుంట
- చెస్ట్ హాస్పిటల్ – ఎర్రగడ్డ
- నేచర్ క్యూర్ హాస్పిటల్ – అమీర్ పేట్
- సరోజిని దేవి కంటి ఆస్పత్రి – మెహిదీపట్నం
- ఆయుర్వేదిక్ హాస్పిటల్ – ఎర్రగడ్డ
- హోమియోపతి హాస్పిటల్ – రామంతాపూర్
- నిజామియా టిబ్బీ హాస్పిటల్ – చార్మినార్
- ఏరియా హాస్పిటల్ – కొండాపూర్
- ఏరియా హాస్పిటల్ – వనస్థలిపురం
- ఈఎస్ఐ హాస్పిటల్ – నాచారం
Free #Corona Testing Centers in Hyderabad. #TelanganaFightsCorona #StayHome #StaySafe pic.twitter.com/91hACno3FC
— Eatala Rajender (@Eatala_Rajender) July 1, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu