తెలంగాణ రాష్ట్రంలో మరో 1198 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూలై 20, సోమవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 46,274 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం నాడు 11,003 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో 7 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 422 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.91 (< 1%) శాతంగా ఉంది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 1,885 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 34,323 కి చేరింది. దీంతో రికవరీ రేటు 74 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం 11,530 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 510, రంగారెడ్డిలో 106, కరీంనగర్ లో 87, మేడ్చల్ లో 76, వరంగల్ అర్బన్ లో 73, మహబూబ్ నగర్ లో 50, జగిత్యాలలో 36, మహబూబాబాద్ లో 36, నిజామాబాద్ లో 31, నాగర్ కర్నూల్ లో 27, జయశంకర్ భూపాలపల్లిలో 26, నల్గొండలో 24, మెదక్ లో 13, సూర్యాపేటలో 12, జనగామలో 12, వికారాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో 11 చొప్పున, సంగారెడ్డిలో 10 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu