తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1524 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూలై 14, మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 37,745 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 13,175 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో 10 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 375 కి పెరిగినట్టు తెలిపారు.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 1161 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 24,840 కి చేరింది. ప్రస్తుతం 12,531 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 815, రంగారెడ్డి లో 240, మేడ్చల్ లో 97, సంగారెడ్డిలో 61, నల్గొండలో 38, వరంగల్ అర్బన్ లో 30, కరీంనగర్ లో 29, మెదక్ లో 24, వికారాబాద్ లో 21, కామారెడ్డిలో 19, రాజన్న సిరిసిల్ల లో 19, నిజామాబాద్ లో 17, సూర్యాపేట లో 15, గద్వాల్ లో 13, జయశంకర్ భూపాలపల్లి లో 12, మంచిర్యాలలో 12 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu