తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 403 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆదివారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,06,742 కి చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1690 కి పెరిగింది. కొత్తగా 313 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 3,00,469 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 146 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (మార్చి 28, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,00,53,026
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 3,06,742
- కొత్తగా నమోదైన కేసులు : 403
- నమోదైన మరణాలు : 2
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 3,00,469
- కరోనా రికవరీ రేటు: 97.95%
- యాక్టీవ్ కేసులు: 4,583
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నవారి సంఖ్య: 1,815
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 1,690
- కరోనా మరణాల రేటు: 0.55%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ