దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. వరుసగా రెండో రోజు కూడా 7 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తాజాగా రోజువారీ పాజిటివిటీ రేటు 2.26 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 7,584 పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 10, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,05,106 కు చేరుకుంది. అలాగే గత 24 గంటల్లో కరోనాతో 24 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,24,747 కి పెరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
దేశంలో 36,267 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.70 శాతం:
దేశంలో ప్రస్తుతం 36,267 (0.08%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 3,791 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,26,44,092 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.70 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. ఇక జూన్ 9, గురువారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 85.41 కోట్లకు (85,41,98,288) చేరుకుంది. జూన్ 9న 3,35,050 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY