తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 457 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూలై 3, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 8,02,379 కి చేరింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 285, సంగారెడ్డిలో 35, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 27, రంగారెడ్డిలో 25, కరీంనగర్ లో 12, ఖమ్మంలో 10 నమోదయ్యాయి. ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. అలాగే మరో 494 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,93,521 కు చేరుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (జూలై 3, సాయంత్రం 5.30 గంటల వరకు):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 3,56,85,855
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 8,02,379
- కొత్తగా నమోదైన కేసులు : 457
- కొత్తగా నమోదైన మరణాలు : 0
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 7,93,521
- కరోనా రికవరీ రేటు: 98.90%
- యాక్టీవ్ కేసులు: 4,747
- నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 4,111
- కరోనా మరణాల రేటు: 0.51%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY