భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 లక్షలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 45,882 కేసులు నమోదు కావడంతో నవంబర్ 20, శుక్రవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 90,04,365 కు చేరుకుంది. కరోనాతో మరో 584 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,32,162 కి పెరిగింది. అదేవిధంగా దేశంలో ఇప్పటికే 84 లక్షల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
ఒకేరోజులో 44,807 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 84,28,410 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 93.60 శాతం గానూ, మరణాల రేటు 1.47 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 4,43,794 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజుల పాటుగా తక్కువ సంఖ్యలోనే కరోనా కేసులు, మరణాలు నమోదవగా, ఇటీవల పండుగ సీజన్ అనంతరం పలు ప్రాంతాల్లో మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండో స్థానంలో, కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన దేశాల్లో మూడో స్థానంలో కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ