ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను ముగించుకుని సోమవారం ఏపీకి పయనమవనున్నారు. నేడు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ముందుగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ గన్నవరం వెళ్లనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో భీమవరం చేరుకుంటారు. భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి వేడుకలలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోదీ పర్యటనకు హాజరవనున్నారు.
సీఎం జగన్ సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలకనున్నారు. అనంతరం గన్నవరం నుంచి భీమవరం బయలుదేరనున్నారు. ఈ క్రమంలో సుమారు 11 గంటలకు భీమవరం చేరుకుని, అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి వేడుకలలో ప్రధాని మోదీతో పాటు పాల్గొననున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12.25 గంటలకు భీమవరం నుంచి తిరిగి 1.05 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుని ప్రధానికి వీడ్కోలు చెప్పనున్నారు. ప్రధాని ఢిల్లీ బయలుదేరిన తర్వాత సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ