తెలంగాణలో రోజురోజుకి కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 920 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 25, గురువారం నాటికీ మొత్తం కేసుల సంఖ్య 11,364 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గురువారం నాడు 3616 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో ఐదుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 230 కి పెరిగినట్టు తెలిపారు. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 327 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 4688 కి చేరింది. ప్రస్తుతం 6446 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(920):
- జీహెచ్ఎంసీ ఏరియా – 737
- రంగారెడ్డి – 86
- మేడ్చల్ – 60
- కరీంనగర్ – 13
- సిరిసిల్ల – 4
- మహబూబ్ నగర్ – 3
- నల్గొండ – 3
- వరంగల్ అర్బన్ – 2
- మెదక్ – 2
- ములుగు – 2
- వరంగల్ రూరల్ – 1
- కామారెడ్డి – 1
- సిద్దిపేట – 1
- వికారాబాద్ – 1
- మహబూబాబాద్ – 1
- ఆదిలాబాద్ – 1
- జనగామ -1
- కొమరం భీం ఆసిఫాబాద్ – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu