తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష 17 వేలు దాటింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 2932 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 27, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,17,415 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గురువారం నాడు 61,863 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 11 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 799 కి పెరిగింది. ఇప్పటివరకు 87,675 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 28,941 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 74.6 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.68 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2932):
- జీహెచ్ఎంసీ – 520
- రంగారెడ్డి – 218
- మేడ్చల్ – 218
- కరీంనగర్ – 168
- నల్గోండ – 159
- ఖమ్మం – 141
- నిజామాబాద్ – 129
- జగిత్యాల – 113
- మంచిర్యాల – 110
- సూర్యాపేట – 102
- సిద్దిపేట – 100
- భద్రాద్రి కొత్తగూడెం – 89
- వరంగల్ అర్బన్ – 80
- మహబూబాబాద్ – 76
- మహబూబ్నగర్ – 67
- రాజన్న సిరిసిల్ల – 64
- పెద్దపల్లి – 60
- వనపర్తి – 51
- కామారెడ్డి – 51
- సంగారెడ్డి – 49
- జోగులాంబ గద్వాల్ – 46
- నాగర్ కర్నూల్ – 42
- యాదాద్రి భువనగిరి – 42
- జనగామ – 38
- వరంగల్ రూరల్ – 34
- నిర్మల్ – 32
- ఆదిలాబాద్ – 25
- మెదక్ – 24
- వికారాబాద్ – 22
- ములుగు – 18
- నారాయణ్ పేట – 16
- ఆసిఫాబాద్ – 15
- జయశంకర్ భూపాలపల్లి – 13
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu