తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 20 వేలు దాటింది. ఆగస్టు 28, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,20,166 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు కొత్తగా 2751 కేసులు నమోదవగా, 62,300 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 9 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 808 కి పెరిగింది. రాష్ట్రంలో 89,350 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 23,049 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 74.3 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.67 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2751):
- జీహెచ్ఎంసీ – 432
- కరీంనగర్ – 192
- రంగారెడ్డి – 185
- నల్గొండ – 147
- ఖమ్మం – 132
- మేడ్చల్ – 128
- నిజామాబాద్ – 113
- సూర్యాపేట – 111
- వరంగల్ అర్బన్ – 101
- పెద్దపల్లి – 97
- సిద్ధిపేట – 96
- జగిత్యాల – 88
- మంచిర్యాల – 86
- మహబూబాబాద్ – 75
- భద్రాద్రి కొత్తగూడెం – 72
- కామారెడ్డి – 65
- మహబూబ్ నగర్ – 64
- వనపర్తి – 63
- యాదాద్రి భువనగిరి – 58
- నాగర్ కర్నూల్ – 54
- రాజన్న సిరిసిల్ల – 48
- నిర్మల్ – 43
- జనగామ – 42
- సంగారెడ్డి – 42
- జోగులాంబ గద్వాల్ – 39
- మెదక్ – 35
- ఆదిలాబాద్ – 30
- వరంగల్ రూరల్ – 30
- ములుగు – 22
- వికారాబాద్ – 17
- నారాయణ్ పేట్ – 16
- జయశంకర్ భూపాలపల్లి – 14
- ఆసిఫాబాద్ – 14
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu