తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష 23 వేలు దాటింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 2924 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 29, శనివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,23,090 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు 61,148 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 10 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 818 కి పెరిగింది. ఇప్పటివరకు 90,988 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 31,284 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 73.9 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.66 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2924):
- జీహెచ్ఎంసీ – 461
- రంగారెడ్డి – 213
- ఖమ్మం – 181
- కరీంనగర్ – 172
- నల్గొండ – 171
- మేడ్చల్ – 153
- నిజామాబాద్ – 140
- సూర్యాపేట – 118
- వరంగల్ అర్బన్ – 102
- సిద్దిపేట – 97
- జగిత్యాల – 92
- మంచిర్యాల – 91
- భద్రాద్రి కొత్తగూడెం – 88
- పెద్దపల్లి – 83
- మహబూబాబాద్ – 80
- యాదాద్రి భువనగిరి – 64
- మహబూబ్నగర్ – 58
- కామారెడ్డి – 56
- రాజన్న సిరిసిల్ల – 55
- నాగర్కర్నూల్ – 51
- వనపర్తి – 46
- జనగామ – 46
- మెదక్ – 45
- సంగారెడ్డి – 44
- ఆదిలాబాద్ – 36
- జోగులాంబ గద్వాల్ – 35
- ములుగు – 34
- నిర్మల్ – 33
- జయశంకర్ భూపాలపల్లి – 24
- వరంగల్ రూరల్ – 17
- వికారాబాద్ – 15
- నారాయణ్ పేట్ – 13
- ఆసిఫాబాద్ – 10
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu