భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా 70 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 35 లక్షలు దాటింది. ఆగస్టు 29, ఆదివారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 35,42,733 కు, మరణాల సంఖ్య 63,498 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 78,761 కరోనా పాజిటివ్ కేసులు, 948 కరోనా మరణాలు నమోదయ్యాయి. కాగా దేశంలో కరోనా మరణాల రేటు 1.8 శాతంగా ఉంది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 27 లక్షలు దాటింది. ఒకే రోజులో 64,935 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 27,13,933 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 76.6 శాతంగా నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లో 7,65,302 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu