తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1, మంగళవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,589 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం నాడు కొత్తగా 2892 కేసులు నమోదవగా, 59,421 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 10 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 846 కి పెరిగింది. రాష్ట్రంలో 97,402 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 32,341 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 74.5 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.64 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2892):
- జీహెచ్ఎంసీ – 477
- రంగారెడ్డి – 234
- మేడ్చల్ – 192
- నల్గొండ – 174
- కరీంనగర్ – 152
- ఖమ్మం – 128
- వరంగల్ అర్బన్ – 116
- నిజామాబాద్ – 110
- సూర్యాపేట – 108
- సిద్దిపేట – 108
- జగిత్యాల – 102
- పెద్దపల్లి – 85
- మంచిర్యాల – 83
- భద్రాద్రి కొత్తగూడెం – 81
- సంగారెడ్డి – 71
- కామారెడ్డి – 64
- మహబూబాబాద్ – 61
- యాదాద్రి భువనగిరి – 60
- మహబూబ్ నగర్ – 53
- వనపర్తి – 51
- నాగర్కర్నూల్ – 45
- జనగామ – 43
- రాజన్న సిరిసిల్ల – 39
- ఆదిలాబాద్ – 38
- వరంగల్ రూరల్ – 38
- మెదక్ – 32
- నిర్మల్ – 31
- జోగులాంబ గద్వాల్ – 28
- ములుగు – 27
- జయశంకర్ భూపాలపల్లి – 21
- వికారాబాద్ – 15
- ఆసిఫాబాద్ – 13
- నారాయణ్ పేట్ – 12
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu