తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 89 వేలు దాటింది. సెప్టెంబర్ 28, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,89,283 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం నాడు 54,308 శాంపిల్స్ పరీక్షించగా, 2072 కేసులు నమోదయినట్టు పేర్కొన్నారు. కరోనా వలన మరో 9 మంది మరణించడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1116 కి పెరిగింది. రాష్ట్రంలో 1,58,690 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 29,477 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 83.83 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2072):
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu