భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ మూడు వేలకు పైగానే కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే గత మూడు రోజులతో పోలిస్తే తాజాగా కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో (సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు) 1,64,740 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 3,038 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,47,29,284కి చేరినట్లయింది. ఇక గత 24 గంటల వ్యవధిలో ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాలలో ఇద్దరు చొప్పున, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, ఏప్రిల్ 04, ఉదయం 8 గంటల వరకు):
- ఏప్రిల్ 3న నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,64,740
- కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 03–ఏప్రిల్ 04 (8AM-8AM)] : 3,038
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,47,29,284
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య : 2,069
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,41,77,204
- కరోనా రికవరీ రేటు : 98.76 శాతం
- యాక్టీవ్ కేసులు : 21,179
- కొత్తగా నమోదైన మరణాలు : 9
- మొత్తం మరణాల సంఖ్య : 5,30,901
- మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసులు: 220.65 కోట్లకు పైగా పంపిణీ
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE