తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1850 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూలై 4, శనివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 22,312 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు 6427 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో 5 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 288 కి పెరిగినట్టు తెలిపారు.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న1342 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 11537 కి చేరింది. ప్రస్తుతం 10487 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1572, రంగారెడ్డి లో 92, మేడ్చల్ లో 53, వరంగల్ అర్బన్ లో 31, కరీంనగర్ లో 18, నిజామాబాద్ లో 17, నల్గొండలో 10 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu