తెలంగాణలో రాష్ట్రంలో జూలై 20, సోమవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46,274 కు చేరింది. సోమవారం నాడు మరో 1198 కేసులు నమోదు కాగా, 11,003 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. అలాగే కరోనా వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 422 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 1,885 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 34,323 కి చేరింది. ప్రస్తుతం 11,530 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 74 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.91 (< 1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1198):
- జీహెచ్ఎంసీ – 510
- రంగారెడ్డి – 106
- కరీంనగర్ – 87
- మేడ్చల్ – 76
- వరంగల్ అర్బన్ – 73
- మహబూబ్ నగర్ – 50
- జగిత్యాల – 36
- మహబూబాబాద్ – 36
- నిజామాబాద్ – 31
- నాగర్ కర్నూల్ – 27
- జయశంకర్ భూపాలపల్లి – 26
- నల్గొండ – 24
- మెదక్ – 13
- సూర్యాపేట -12
- జనగామ -12
- వికారాబాద్ – 11
- ఆదిలాబాద్ – 11
- భద్రాద్రి కొత్తగూడెం -11
- సంగారెడ్డి – 10
- ములుగు – 9
- పెద్దపల్లి – 8
- ఆసిఫాబాద్ – 4
- సిద్ధిపేట – 3
- జోగులాంబ గద్వాల్ – 3
- మంచిర్యాల – 3
- ఖమ్మం – 3
- వరంగల్ రూరల్ – 1
- నిర్మల్ – 1
- యాదాద్రి భువనగిరి – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu