దేశంలో కరోనా ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. యాక్టీవ్ కేసులు వరుసగా రెండో రోజూ కూడా తగ్గాయి. అయితే కరోనా మరణాలు మాత్రం పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,48,421 కేసులు, 4205 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,33,40,938 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,54,197 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా వంటి 10 రాష్ట్రాల్లోనే 71.22 శాతం కేసులు నమోదు అయ్యాయి. దేశంలో ప్రస్తుతం 37,04,099 (15.87%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరో 3,55,338 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,93,82,642 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 83.04 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.09 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలివే (మే 11 8am–మే 12 8am) :
- మహారాష్ట్ర – 40956
- కర్ణాటక – 39510
- కేరళ – 37290
- తమిళనాడు – 29272
- ఉత్తరప్రదేశ్ – 20445
- ఆంధ్రప్రదేశ్ – 20345
- వెస్ట్ బెంగాల్ – 20136
- రాజస్థాన్ – 16080
- ఢిల్లీ – 12481
- హర్యానా – 11637
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా మరణాలు నమోదైన రాష్ట్రాలివే:
- మహారాష్ట్ర – 793
- కర్ణాటక – 480
- ఢిల్లీ – 347
- ఉత్తర్ ప్రదేశ్ – 301
- తమిళనాడు – 298
- పంజాబ్ – 214
- ఛత్తీస్ ఘడ్ – 199
- రాజస్థాన్ – 169
- హర్యానా – 144
- వెస్ట్ బెంగాల్ – 132
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ