తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1473 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 26, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 55,532 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఆదివారం నాడు 9,817 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 8 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 471 కి పెరిగింది. అలాగే కరోనా మరణాల రేటు 0.86 (<1%) శాతంగా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 42,106 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 12,955 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1473):
- జీహెచ్ఎంసీ – 506
- రంగారెడ్డి – 168
- వరంగల్ అర్బన్ – 111
- సంగారెడ్డి – 98
- కరీంనగర్ – 91
- మేడ్చల్ – 86
- నిజామాబాద్ – 41
- మహబూబాబాద్ – 34
- సూర్యాపేట – 32
- జోగులాంబ గద్వాల్ – 32
- ఆదిలాబాద్ – 28
- నల్గొండ – 28
- ఖమ్మం – 20
- నాగర్ కర్నూల్ – 19
- రాజన్న సిరిసిల్ల – 19
- జగిత్యాల – 18
- కామారెడ్డి – 17
- మెదక్ – 17
- మంచిర్యాల – 14
- ములుగు – 12
- సిద్ధిపేట – 12
- యాద్రాద్రి భువనగిరి – 11
- భద్రాద్రి కొత్తగూడెం – 10
- జనగామ – 10
- జయశంకర్ భూపాలపల్లి – 10
- వనపర్తి – 9
- వరంగల్ రూరల్ – 8
- మహబూబ్ నగర్ – 8
- నారాయణ పేట్ – 2
- వికారాబాద్ – 2
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu