తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1764 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 28, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 58,906 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం నాడు 18,858 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 12 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 492 కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 43,751 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 14,663 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 74.3 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.84 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1764):
- జీహెచ్ఎంసీ – 509
- మేడ్చల్ – 158
- రంగారెడ్డి – 147
- వరంగల్ అర్బన్ – 138
- కరీంనగర్ – 93
- సంగారెడ్డి – 89
- ఖమ్మం – 69
- నల్గొండ – 51
- నిజామాబాద్ - 47
- మహబూబ్నగర్ – 47
- పెద్దపల్లి – 44
- వరంగల్ రూరల్ – 41
- సూర్యపేట – 38
- భద్రాది కొత్తగూడెం – 30
- నాగర్ కర్నూల్ – 29
- మంచిర్యాల – 28
- మెదక్ – 23
- జోగులాంబ గద్వాల్ – 22
- సిద్ధిపేట – 21
- ములుగు – 17
- ఆదిలాబాద్ – 15
- రాజన్న సిరిసిల్ల – 13
- జనగామ – 13
- జగిత్యాల – 12
- యాదాద్రి భువనగిరి – 11
- కామారెడ్డి -10
- మహబూబాబాద్ – 9
- జయశంకర్ భూపాలపల్లి – 8
- నిర్మల్ – 8
- నారాయణ్ పేట్ – 7
- వికారాబాద్ – 7
- ఆసిఫాబాద్ – 6
- వనపర్తి – 4
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu