కేంద్రప్రభుత్వం తాజాగా అన్లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. గత కొన్ని నెలలుగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధిస్తూ వస్తున్నా రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేసి, రాత్రి సమయంలో వ్యక్తుల కదలికలపై పరిమితులు తొలగించారు. అదే విధంగా ఆగస్టు 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్లకు అనుమతి ఇచ్చారు. అయితే స్కూళ్లు, విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్ పై ఆగస్టు 31 వరకు నిషేధాన్ని పొడిగించారు. అలాగే దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్డౌన్ కూడా ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu