తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఆగస్టు 6, గురువారం రాత్రి 8 గంటల నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75,257 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొంది. గురువారం నాడు కొత్తగా 2207 కేసులు నమోదవగా, 23,495 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 12 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 601 కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 53239 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 21,417 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 70.7 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.79 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2207):
- జీహెచ్ఎంసీ – 532
- రంగారెడ్డి – 196
- వరంగ్ అర్బన్ – 142
- మేడ్చల్ – 136
- కామారెడ్డి – 96
- కరీంనగర్ – 93
- నిజామాబాద్ - 89
- జోగులాంబ గద్వాల్ – 87
- ఖమ్మం – 85
- భద్రాద్రి కొత్తగూడెం – 82
- పెద్దపల్లి – 71
- జనగామ – 60
- మహబూబ్ నగర్ – 51
- సంగారెడ్డి – 37
- నాగర్ కర్నూల్ – 36
- జగిత్యాల – 36
- మంచిర్యాల – 35
- మెదక్ – 32
- జయశంకర్ భూపాలపల్లి – 29
- సిద్దిపేట – 28
- నల్గొండ – 28
- రాజన్న సిరిసిల్ల – 25
- వికారాబాద్ – 24
- సూర్యాపేట – 23
- యాదాద్రి భువనగిరి – 23
- మహబూబాబాద్ – 21
- ఆసిఫాబాద్ – 21
- ములుగు – 20
- వనపర్తి – 18
- వరంగల్ రూరల్ – 16
- నారాయణ్ పేట్ – 15
- ఆదిలాబాద్ – 14
- నిర్మల్ – 6
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu