తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఆగస్టు 10, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,647 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొంది. సోమవారం నాడు కొత్తగా 1896 కేసులు నమోదవగా, 18,035 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 8 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 645 కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 59,374 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 22,628 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 71.84 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.78 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1896):
- జీహెచ్ఎంసీ – 338
- రంగారెడ్డి – 147
- కరీంనగర్ - 121
- మేడ్చల్ – 119
- వరంగల్ అర్బన్ – 95
- జోగులాంబ గద్వాల – 85
- కామారెడ్డి – 71
- జనగామ – 71
- పెద్దపల్లి – 66
- ఖమ్మం – 65
- సిద్ధిపేట – 64
- భద్రాద్రి కొత్తగూడెం – 60
- జగిత్యాల – 59
- మహబూబ్ నగర్ – 58
- నల్గొండ – 54
- సంగారెడ్డి – 49
- నిజామాబాద్ – 42
- రాజన్న సిరిసిల్ల – 38
- వరంగల్ రూరల్ – 35
- సూర్యాపేట – 32
- వనపర్తి – 28
- యాదాద్రి భువనగిరి – 24
- ములుగు – 23
- మహబూబాబాద్ – 23
- వికారాబాద్ – 21
- జయశంకర్ భూపాలపల్లి – 20
- ఆసిఫాబాద్ – 17
- ఆదిలాబాద్ – 14
- మెదక్ – 14
- నారాయణ్ పేట్ – 13
- నిర్మల్ – 12
- మంచిర్యాల – 11
- నాగర్ కర్నూల్ – 7
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu