తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ఈ మేరకు మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలతో నిజామాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హనుమకొండ, మంచిర్యాల, మెదక్, వనపర్తి, నిర్మల్, ఆదిలాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, జగిత్యాల, హైదరాబాద్, వికారాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చారు.
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:
- మహిళా శిశు సంక్షేమ, సీనియర్ సిటిజెన్ శాఖ స్పెషల్ సెక్రెటరీ, కమిషనర్ గా భారతి హొళికెరి నియామకం
- నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా రాజీవ్ గాంధీ హన్మంతు
- మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గా అమయ్ కుమార్, తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు హైదరాబాద్ కలెక్టర్ గా అమయ్ కుమార్ కు అదనపు బాధ్యతలు
- హనుమకొండ జిల్లా కలెక్టర్ గా సిక్తా పట్నాయక్
- ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గా రాహుల్ రాజ్
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా నారాయణరెడ్డి
- కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గా షేక్ యాస్మిన్ భాషా
- మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా జి.రవి
- సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా ఎస్.వెంకట రావు
- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఎస్.హరీశ్
- మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా బాదావత్ సంతోష్
- మెదక్ జిల్లా కలెక్టర్ గా రాజశ్రీ షా
- వనపర్తి జిల్లా కలెక్టర్ గా తేజస్ నందలాల్ పవార్
- నిర్మల్ జిల్లా కలెక్టర్ గా కర్నాటి వరుణ్రెడ్డి
- కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కు జగిత్యాల కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగింత.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE