తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 20, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 99,391 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొంది. గురువారం నాడు కొత్తగా 1967 కేసులు నమోదవగా, 26,767 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 8 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 737 కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 76,967 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 21,687 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 77.43 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.74 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1967):
- జీహెచ్ఎంసీ – 473
- రంగారెడ్డి – 202
- మేడ్చల్ – 170
- వరంగల్ అర్బన్ – 101
- కరీంనగర్ – 86
- జగిత్యాల – 81
- ఖమ్మం – 79
- నిజామాబాద్ – 69
- నల్గొండ – 60
- జోగులాంబ గద్వాల్ – 55
- కామారెడ్డి – 55
- సిద్దిపేట – 49
- మంచిర్యాల – 40
- సంగారెడ్డి – 38
- పెద్దపల్లి – 35
- రాజన్న సిరిసిల్ల – 29
- మహబూబ్నగర్ – 29
- సూర్యాపేట – 28
- నాగర్కర్నూల్ – 27
- వరంగల్ రూరల్ – 26
- మహబూబాబాద్ – 26
- మెదక్ – 24
- జనగామ - 22
- భద్రాద్రి కొత్తగూడెం – 21
- వనపర్తి – 21
- నిర్మల్ -19
- యాదాద్రి భువనగిరి 18
- ఆదిలాబాద్ – 16
- వికారాబాద్ – 16
- ఆసిఫాబాద్ – 15
- నారాయణ్ పేట – 14
- జయశంకర్ భూపాలపల్లి – 12
- ములుగు – 11
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu