తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 30 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు నమోదు ఎక్కువుగా ఉంది. కొత్తగా 1273 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 23, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,30,274 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 5 గురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1303 కి పెరిగింది. ఇప్పటివరకు 2,09,034 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 19,937 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 90.77 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.56 శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1273):
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu