తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1481 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,34,152 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనాతో మరో 4 గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1319 కి పెరిగింది. అలాగే మంగళవారం నాడు 40,081 శాంపిల్స్ పరీక్షించగా, రాష్ట్రంలో పరీక్షలు సంఖ్య 41,55,597 కు చేరుకుంది.
ఇక గత కొన్ని రోజులుగా కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల కంటే, కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువుగా ఉంటుంది. ఇప్పటివరకు 2,14,917 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 279, మేడ్చల్ లో 138, రంగారెడ్డి జిల్లాలో 111, ఖమ్మంలో 82, నల్గొండలో 82, భద్రాద్రి కొత్తగూడెం లో 79, కరీంనగర్ లో 79, వరంగల్ అర్బన్ లో 45 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (అక్టోబర్ 27, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 41,55,597
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 2,34,152
- కొత్తగా నమోదైన కేసులు : 1481
- నమోదైన మరణాలు : 4
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 2,14,917
- కరోనా రికవరీ రేటు: 91.78%
- యాక్టీవ్ కేసులు: 17,916
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నవారి సంఖ్య: 14,883
- మొత్తం మరణాల సంఖ్య : 1319
- కరోనా మరణాల రేటు: 0.56%
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu